తాటి ఇంటింటి ప్రచారం

భద్రాద్రి కొత్తగూడెం,అక్టోబర్‌11 (జ‌నంసాక్షి): సీఎం కేసీఆర్‌ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలే టీఆర్‌ఎస్‌ పార్టీకి శ్రీరామ రక్ష అని ట్రైకార్‌ చైర్మన్‌, అశ్వారావుపేట నియోజకవర్గ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి తాటి వెంకటేశ్వర్లు అన్నారు. ఇంటింటి ప్రచారంలో ఓటర్లను కలుసుకొని ఓట్లు ఆభ్యర్ధించారు.  రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ తోనే అభివృద్ధి సాధ్యమన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు ఇంటింటికీ చేరాయన్నారు. సీఎం కేసీఆర్‌ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు ప్రజల మన్నలను పొందాయన్నారు. కేసీఆర్‌ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేశారన్నారు. దేశంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారన్నారు. రాష్ట్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసి దేశంలో ముందంజలో ఉంచారన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే ఆదర్శంగా నిలిపిన ఘనత కేసీఆర్‌కు దక్కుతుందన్నారు. ప్రతిపక్షాలు సంక్షేమ పథకాలను అడ్డుకుంటున్నారన్నారు. టీఆర్‌ఎస్‌ గెలుపు కోసం నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా కృషి చేయాలన్నారు.