తిరుమల వ్యవహారాలపై  సీబీఐ విచారణకు ఎందుకు జంకాలి

చంద్రబాబు ధర్మపోరాట సభలో అధర్మ పన్నాగాలు
మండిపడ్డ వైకాపా ప్రతినిధి అంబటి రాంబాబు
విజయవాడ,మే23( జ‌నం సాక్షి): తిరుమల వ్యవహారాలపై  సీబీఐ విచారణకు చంద్రబాబు ఎందుకు వెనకాడుతున్నారని వైకాపా అధికరార ప్రతినిధి అంబటి రాంబాబు ప్రశ్నించారు. తిరుమల పోటులో తవ్వకాలపై విజయసాయి రెడ్డి చేసిన ఆరోపణలపై ప్రభుత్వం స్పందించి విచారణ జరపాలన్నారు. ఆయన బుధవారం విూడియాతో మాట్లాడుతూ.. ‘ధర్మపోరాట దీక్ష ప్రదేశాన్ని శుద్ది చేసేందుకు వెళుతున్న ఎంపీ విజయసాయి రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకోవడం దారుణం అన్నారు.  పోలీసులను చంద్రబాబు తన జేబు సంస్ధగా చేసుకున్నారు. ఇది ప్రజాస్వామ్య విరుద్దం. మరోవైపు  జనాలను బలవంతంగా తోలుకు వచ్చి ధర్మపోరాట సభను నిర్వహించారు. తిరుపతి, నెల్లూరు, అమరావతిలో ప్రధాని ప్రసంగాన్ని ఈ సభలో చూపించారు.. మోదీ మోసాన్ని చూపించారు.. మరి చంద్రబాబు ఈ మూడు చోట్ల మాట్లాడిన మాటలను చూపించకపోవడం ఎటువంటి ధర్మం అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై  తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రత్యేక ప్యాకేజీ పై హర్షం వ్యక్తం చేస్తూ చంద్రబాబు అర్ధరాత్రి చేసిన ప్రకటనను ఎందుకు చూపించలేదు. ఇది ఎలా ధర్మం అవుతుంది. అధర్మం కాదా? ధర్మపోరాట సభలో చంద్రబాబు ప్రసంగానికి ఆయన పార్డీ కార్యకర్తలకే అర్ధం కావడం లేదు. ధర్మ పోరాటం అంటే ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సులు పెట్టి జనాన్ని తీసుకురావడమా? ధర్మ పోరాట సభలో బీజేపీతో వైఎస్సార్‌సీపీ మిలాఖత్‌ అయ్యిందని చెప్పడం మరింత విడ్డూరం. రాష్ట్రంలో 25 ఎంపీలను ఇస్తే ¬దా తెస్తానని చంద్రబాబు ఎలా చెబుతున్నారు. చంద్రబాబు వద్ద ధర్మం లేదు, విూది అసలు పోరాటమే కాదు. ఎన్నికల సభల మాదిరిగా ధర్మపోరాట దీక్ష సభ నిర్వహిస్తున్నారు. ఈ సభల్లో వైఎస్‌ఆర్‌ తన పాలనలో ఇచ్చిన హావిూలను నెరవేర్చలేదని అసత్య ఆరోపణలు చేస్తున్నారు. ఈ దేశ రాజకీయాలలోనే నమ్మకద్రోహి చంద్రబాబే. కుట్ర అనే పదానికి చంద్రబాబు ఆద్యుడు. కుట్ర రాజకీయాలు, నమ్మకద్రోహంపై చంద్రబాబు మాట్లాడటం హాస్యాస్పదం. 29సార్లు ఢిల్లీకి వెళ్ళి ప్రత్యేక ¬దా అడగలేదు. అమరావతికి ప్రధాని వస్తే ప్రత్యేక ప్యాకేజీ అడిగిన ఘనత చంద్రబాబుది’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.