తిరుమల శ్రీవారి సేవలో శ్రీనువైట్ల బృందం

తిరుపతి,నవంబర్‌14(జ‌నంసాక్షి):అమర్‌ అక్బర్‌ ఆంటోని చిత్ర యూనిట్‌ సభ్యులు బుధవారం ఉదయం శ్రీవారిని దర్శించుకున్నారు. చిత్ర దర్శకుడు శ్రీను వైట్ల చిత్ర నిర్మాతలతో కలిసి చిత్ర యూనిట్‌ అంతా బుధవారం ఉదయం విఐపి విరామ సమయంలో శ్రీవారి సేవలో పాల్గొన్నారు. ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లను చేశారు. అనంతరం ఆలయం వెలుపల దర్శకుడు శ్రీను వైట్ల విూడియాతో మాట్లాడుతూ…తిరుమలకు తనకూ ఒక మంచి అనుబంధం ఉందన్నారు. తన ప్రతి సినిమా విడుదలకు ముందు స్వామి వారి ఆశీస్సులు తీసుకోవడం సంతోషంగా ఉందని తెలిపారు. ఈ నెల 16 న విడుదల కానున్న ‘ అమర్‌ అక్బర్‌ ఆంటోని ‘ సినిమాను అందరూ కుటుంబ సమేతంగా చూసేలా చిత్రీకరించామన్నారు. ప్రతి ఒక్కరూ ఈ సినిమాచూసి ఆదరించాలని శ్రీను వైట్ల కోరారు.