తీజ్ ఉత్సవాల్లో పాల్గొన్న సీతక్క
ములుగు,ఆగస్ట్30(జనం సాక్షి): గోవిందరావుపేట మండలంలోని బాలాజీనగర్ గ్రామంలో గురువారం తీజ్ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ఏఐసీసీ మహిళా ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే సీతక్క పాల్గొన్నారు. లంబాడ గిరిజనులతో కలిసి ఆమె నృత్యం చేశారు. తీజ్ గిరిజనుల సాంస్కృతిక వేదిక అన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు చంద్రశేఖర్, పి. వెంకట కృష్ణ, సుధాకర్, కె. సాంబశివుడు, బి. రాజు పాల్గొన్నారు.