తెదేపాపై కోపంతో ఏపీకి అన్యాయం చేయొద్దు

– ట్విటర్‌లో పవన్‌కల్యాణ్‌
అమరావతి, జులై20(జ‌నం సాక్షి) : కేంద్రంపై తెదేపా ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై శుక్రవారం పార్లమెంట్‌లో చర్చ జరిగింది. ఈ సందర్భంగా శుక్రవారం ఉదయం అవిశ్వాసానికిముందు  జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ ట్విటర్‌ వేదికగా స్పందించారు. ఆంధప్రదేశ్‌కు ప్రత్యేక ¬దా ఇవ్వాలని ప్రజల పక్షాన కేంద్రాన్ని కోరుతున్నట్లు పవన్‌ తెలిపారు. తెలుగుదేశం పార్టీతో చెడినందున.. వారిపై కోపంతో ప్రత్యేక ¬దా నిరాకరించటం సరికాదని అభిప్రాయపడ్డారు. ఏపీ ప్రజల హక్కులు సాధించుకునేందుకు, కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు పార్లమెంటు సరైన వేదికగా భావిస్తున్నట్లు పవన్‌ పేర్కొన్నారు. కేంద్రం అన్ని ప్రాంతాలను ఒకే విధంగా చూడాలని, పార్టీలపై కక్షతో ప్రజలను ఇబ్బందులకు గురి చేయవద్దని కోరారు.