తెరాసదే మళ్లీ విజయం: వినయ్‌

వరంగల్‌,డిసెంబర్‌4(జ‌నంసాక్షి): ఈనెల 7న జరిగే ఎన్నికలలో తెలంగాణ అంతటా తెరాస విజయం సాధించి మరోమారు సీఎంగా కేసీఆర్‌ పగ్గాలు చేపడతారని వరంగల్‌ పశ్చిమ అభ్యర్థి వినయ్‌ భాస్కర్‌  చెప్పారు. ఈనెల 11న వెల్లడలయ్యే ఫలితాలు తెరాసకు అనుకూలంగా రాబోతున్నాయని చెప్పారు. మెజార్టీ స్థానాలు తెరాస గెలిచి మరోమారు ముఖ్యమంత్రి గా కేసీఆర్‌ ప్రమాణం చేస్తారని వివరించారు. తెలంగాణలో అభివృద్ది, వికాసానికి సీఎంగా ఆయన చేసిన పనులను ప్రస్తావించారు.