తెలంగాణకు తలమాణీకం కానున్న యాదాద్రి

పనుల్లో రాజీలేకుండా సకాలంలో పూర్తి చేస్తాం

పచ్చదనం వెల్లివిరిసేలా హరితహారం

పభుత్వ విప్‌ గొంగిడి సునీతా మహేందర్‌రెడ్డి

యాదాద్రి,జూలై20(జ‌నం సాక్షి): తెలంగాణకు తలమాణీకం కానున్న యాదాద్రి శ్రీ లక్ష్మి నరసింహ్మ స్వామి దేవస్థానం ప్రాంతం పూర్తిగా ఆహ్లాద వాతావరణం సంతరించుకోబోతుందని ప్రభుత్వ విప్‌, ఆలేరు శాసన సభ్యురాలు గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి అన్నారు. ఇక్కడ హరితహారం పెద్ద ఎత్తున చేపట్టామని అన్నారు. పచ్చదనం పరిమళించేలా చేస్తున్నామని అన్నారు. ఇందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రత్యేక నిధులు కేటాయించి పనులు ప్రారంభించారన్నారు. భవిష్యత్‌లో యాదాద్రి కొండ దిగువ ప్రాంతాలలో జనాభా గణనీయంగా పెరిగే అవకాశం ఉంది కనుక స్థానిక గ్రామ పంచాయతీలను అన్నిటినీ కలిపి పురపాలక సంఘంగా మార్చారని తెలిపారు. యాదాద్రి పరిసర ప్రాంతాల అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేస్తున్న పనులు ఆయన దూరదృష్టికి నిదర్శనమన్నారు. యాదగిరిగుట్ట త్వరలో మున్సిపాలిటీగా మారనుందని, ఇందుకు కావాల్సిన అన్ని హంగులతో అభివృద్ధి చేస్తామని అన్నారు. యాదగిరిగుట్ట పట్టాణాభివృద్ధికి రాజీపడే ప్రసక్తే లేదని తెలిపారు. భవిష్యత్‌ లో దిగువ ప్రాంతాలలో పెరిగే నీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని రోజుకు కనీసం 15 నుంచి 20 లక్షల లీటర్లకు పైగా నీరు అందుబాటులో ఉండేలా మిషన్‌ భగీరథ పథకం ద్వారా తగు చర్యలు తీసుకున్నామని తెలిపారు. పట్టణంలో 100 డబుల్‌ బెడ్‌ రూమ్‌, అంబేద్కర్‌ భవనం మంజూరయ్యాయని, స్థలం లేకపోవడంతో జాప్యం జరుగుతున్నదన్నారు. త్వరలో స్థలాన్ని సేకరించి డబుల్‌ బెడ్‌ రూంలు, అంబేద్కర్‌ భవన నిర్మాణం చేపడతామన్నారు. అన్ని వాడల్లో అంతర్గత రోడ్లు, అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీలను నిర్మిస్తామని హావిూనిచ్చారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు పోతున్నామని సునీతా మహేందర్‌రెడ్డి అన్నారు. ఒక వైపు గ్రామాల్లో అభివృద్ధి పథకాలను ప్రారంభిస్తూనే మరోవైపు ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు అధికారులను అప్రమత్తం చేస్తున్నామని అన్నారు. తమ సమస్యలను తీర్చాలంటూ వచ్చిన ప్రజలకు ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీతా మహేందర్‌రెడ్డి వెంటనే తీర్చేలా తగుచర్యలు తీసుకుంటున్నారు. ఇదిలావుంటే యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామి వారి ఆలయానికి సోమవారం వరకు ఐఎస్‌వో సర్టిఫికెట్‌ను ప్రదానం చేయనున్నామని ఐఎస్‌వో ఆడిటర్‌ శివయ్య తెలిపారు. ఇటీవల యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయ నిర్వహణ తీరుతెన్నులను ఐఎస్‌వో బృందం పరిశీలించింది. ఇప్పటికే జూన్‌ నెలలో ఒకసారి ఆలయ నిర్మాణం తీరుతెన్నులను పరిశీలించిన బృందం రెండో దఫాగా పరిశీలనలు చేశారు. ఆలయంలోని రికార్డులను పరిశీలించారు. ఆడిటింగ్‌ జరుగుతున్న విధానాన్ని, రికార్డు రూమ్‌ పరిశీలన, ఉద్యోగులు ఆలయానికి

వస్తున్న భక్తుల పట్ల చూపిస్తున్న శ్రద్ధాసక్తులు, పని విూద ఉద్యోగులకు గల దృష్టి, భక్తులకు కల్పిస్తున్న వసతులు, దర్శనాల తీరుతెన్నులు, గోశాలలో గోవుల బాగోగులు, ఆలయానికి గల తోట నిర్వహణ తదితర అంశాలపై తాము నిర్దేశించుకున్న నిబంధనల మేరకు ఉన్నాయా లేదా అనే విషయంపై స్పష్టతకు వచ్చిన విూదట విూడియాకు వివరాలను వెల్లడించారు.