తెలంగాణలో కొత్తగా 1421 కరోనా కేసులు

హైదరాబాద్‌,అక్టోబరు 23(జనంసాక్షి):తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గురువారం కొత్తగా 1,421 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 2,29,001కి చేరింది. తాజాగా కరోనా కారణంగా ఆరుగురు మృతి చెందగా మొత్తం మృతుల సంఖ్య 1,298కి చేరింది. ఈ మేరకు శుక్రవారం ఉదయం వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్‌ విడుదల చేసింది. తాజాగా 1,221 మంది మహమ్మారి నుంచి కోలుకోగా.. ఇప్పటి వరకు 2,07,326 మంది కరోనాను జయించినట్లు ప్రభుత్వం బులిటెన్‌లో పేర్కొంది. రాష్ట్రంలో ప్రస్తుతం 20,337 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు తెలిపింది. 17,214 మంది ¬ం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. మరోవైపు జీహెచ్‌ఎంసీ పరిధిలో 249 కేసులు నమోదైనట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది.