తెలంగాణలో కొత్తగా 1456 కరోనా కేసులు

హైదరాబాద్‌,అక్టోబరు 22(జనంసాక్షి): తెలంగాణలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. తెలంగాణ హెల్త్‌ బులిటెన్‌ను వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసింది. తెలంగాణలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,456 కరోనా కేసులు నమోదు అయ్యాయి. గడిచిన 24 గంటల్లో కరోనాతో ఐదుగురు మృతి చెందారు. తెలంగాణ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 2,27,580కి చేరుకుంది. కాగా.. ఇప్పటి వరకూ రాష్ట్ర వ్యాప్తంగా 1,292 మంది మృతి చెందారు. ప్రస్తుతం తెలంగాణలో 20,183 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకూ కరోనా నుంచి 2,06,105 మంది కోలుకున్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా 254, రంగారెడ్డి 98, నల్గొండ 92 కేసులు నమోదు అయ్యాయి.