తెలంగాణలో కొత్తగా 631 కరోనా కేసులు

 

హైదరాబాద్‌,డిసెంబరు 4(జనంసాక్షి): తెలంగాణ రాష్ట్రంలో నిన్న రాత్రి 8గంటల వరకు 57,405 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా 631 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 2,72,123కి చేరింది. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ శుక్రవారం ఉదయం బులిటెన్‌ విడుదల చేసింది. నిన్న కరోనాతో ఇద్దరు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,467కి చేరింది. కరోనాబారి నుంచి నిన్న 802 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్న బాధితుల సంఖ్య 2,61,830కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 8,826 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని, వారిలో 6,812 మంది ¬ం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ఇప్పటి వరకు తెలంగాణలో నిర్వహించిన కరోనా నిర్థారణ పరీక్షల సంఖ్య 56,62,711కి చేరింది.