తెలంగాణలో మళ్లీ స్వైన్ ఫ్లూ కలకలం

మహబూబ్ నగర్ : తెలంగాణలో మళ్లీ స్వైన్ ఫ్లూ కలకలం రేగింది. జిల్లాలో నలుగురికి స్వైన్ ఫ్లూ నిర్థారణ అయింది. స్వైన్ ఫ్లూ సోకిన వారిలో ముగ్గురు వైద్య ఆరోగ్యశాఖ ఉద్యోగులున్నారు. ఆసుపత్రుల్లో సరైన సౌకర్యాలు లేకపోవడం, ఆసుపత్రి సిబ్బంది జాగ్రత్తలు తీసుకోకపోవడంతో… వారికి కూడా స్వైన్ ఫ్లూ సోకిందని అధికారులు తెలిపారు.