తెలంగాణలో 1949 కరోనా కేసులు

హైదరాబాద్‌,అక్టోబరు 4(జనంసాక్షి):తెలంగాణ రాష్ట్రంలో నిన్న రాత్రి 8గంటల వరకు 51,623 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా 1,949 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 1,99,276కి చేరింది. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ ఆదివారం ఉదయం బులిటెన్‌ విడుదల చేసింది. నిన్న ఒక్కరోజే కరోనాతో 10 మంది మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1163కి చేరింది. కరోనా బారి నుంచి నిన్న ఒక్క రోజే 2,366 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్న బాధితుల సంఖ్య 1,70,212కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 27,901 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని, వారిలో 22,816 మంది ¬ం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. తెలంగాణలో ఇప్పటి వరకు నిర్వహించిన కరోనా నిర్థారణ పరీక్షల సంఖ్య 32,05,249కి చేరింది. మరోవైపు జీహెచ్‌ఎంసీ పరిధిలో 291 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది.