తెలంగాణ డిసిసిలకు కొత్త అధ్యక్షులు

ఆమోదించిన కాంగ్రెస్‌ అధిష్టానం
హైదరాబాద్‌,ఫిబ్రవరి7(జ‌నంసాక్షి): తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షులను కాంగ్రెస్‌ పార్టీ అధిష్ఠానం ప్రకటించింది. మొత్తం 31 మంది డీసీసీ అధ్యక్షుల నియామకానికి ఆ పార్టీ అధినేత రాహుల్‌ ఆమోదం తెలిపారని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ వెల్లడించారు. వీరితో పాటు ఇద్దరు సిటీ
కాంగ్రెస్‌ అధ్యక్షులను ఆ పార్టీ నియమించింది. ఖమ్మం పట్టణానికి చెందిన దీపక్‌ చౌదరిని పీసీసీ కార్యనిర్వహక అధ్యక్షుడిగా నియమిస్తున్నట్లు ఏఐసీసీ వర్గాలు వెల్లడించాయి. మొత్తం 33 మందితో కూడిన జాబితాను ఆ పార్టీ గురువారం విడుదల చేసింది.
అదిలాబాద్‌- బార్గవ్‌ దేశ్‌పాండే
మంచిర్యాల- కొక్కిరాల సురేఖ
నిర్మల్‌- రామారావు పటేల్‌ పవార్‌
కొమరం భీమ్‌ ఆసిఫాబాద్‌- ఆత్రం సక్కు
కరీంనగర్‌ – కె. మృతంజయం
జగిత్యాల- లక్ష్మణ్‌కుమార్‌
పెద్దపల్లి – ఈర్ల కొమురయ్య
రాజన్న సిరిసిల్ల- ఎన్‌.సత్యనారాయణగౌడ్‌
నిజామాబాద్‌- మనాల మోహన్‌ రెడ్డి
నిజామాబాద్‌ నగర కాంగ్రెస్‌ – కేశ వేణు
కామారెడ్డి- కైలాస్‌ శ్రీనివాసరావు
వరంగల్‌ రూరల్‌/ అర్బన్‌ – నాయిని రాజేందర్‌ రెడ్డి
వరంగల్‌ నగర కాంగ్రెస్‌ – కేదారి శ్రీనివాసరావు
జయశంకర్‌ భూపాల్‌పల్లి – గండ్ర జ్యోతి
జనగామ- జంగా రాఘవ రెడ్డి
సంగారెడ్డి- నిర్మలాగౌడ్‌
మెదక్‌- తిరుపతి రెడ్డి
సిద్దిపేట- టి.నరసారెడ్డి
వికారాబాద్‌- పి.రోహిత్‌ రెడ్డి
మేడ్చల్‌ మల్కాజిగిరి- కూన శ్రీశైలం గౌడ్‌
రంగారెడ్డి- చల్లా నరసింహారెడ్డి
మహబూబ్‌నగర్‌- కొత్వాల్‌ ఒబెదుల్లా
వనపర్తి- శంకర్‌ ప్రసాద్‌
జోగులాంబ గద్వాల్‌- పటేల్‌ ప్రభాకర్‌ రెడ్డి
నాగర్‌కర్నూల్‌- సీహెచ్‌ వంశీకృష్ణ
సూర్యాపేట- చెవిటి వెంకన్న యాదవ్‌
యాదాద్రి భువనగిరి- బి.బిక్ష్మయ్యగౌడ్‌
మహబూబాబాద్‌- జె.భరత్‌ చంద్రారెడ్డి
నల్గొండ- కె.శంకర్‌నాయక్‌
భద్రాద్రి కొత్తగూడెం- వనమా వెంకటేశ్వరరావు
ఖమ్మం- పువ్వాడ దుర్గాప్రసాద్‌
సిటీ కాంగ్రెస్‌ అధ్యక్షులు
ఖమ్మం నగరం- జావీద్‌
గ్రేటర్‌ హైదరాబాద్‌- ఎం.అంజన్‌కుమార్‌ యాదవ్‌