తెలంగాణ పంచాయతీ ఎన్నికలపై ఇసి కసరత్తు

హైదరాబాద్‌,మే22(జ‌నం సాక్షి ): తెలంగాణ పంచాయతీ ఎన్నికలకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. పంచాయతీ ఎన్నికల నిర్వహణపై ఈనెల 30న జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో తెలంగాణ ఎన్నికల సంఘం సమావేశం కానుంది.  స్థానిక సంస్థల సమరానికి ఎన్నికల సంఘం శరవేగంగా సన్నద్ధమవుతోంది. ఇప్పటికే ఎన్నికలకు కసరత్తు ముమ్మరం చేసిన ఈసీ.. వార్డుల వారీ ఓటరు జాబితాల తయారీ సహా ఎన్నికల ఏర్పాట్లపై అధికారులకు మార్గదర్శనం చేసింది. ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు జిల్లాల పాలనా యంత్రాంగానికి, పోలీసు శాఖకు దిశానిర్దేశర చేసింది.