తెలుగు వారి కోసం పొరాడిన మహాపురుషుడు

అమరజీవి పొట్టి శ్రీరాములు వర్థంతి సందర్భంగా మునగాల మండల కేంద్రంలోని పొట్టి శ్రీరాములు విగ్రహానికి గురువారం ఆర్యవైశ్య సంఘం వాసవి క్లబ్ మునగాల వారి ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆమరణ నిరాహారదీక్ష చేసిన పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగం మరువలేనిదని ఆర్యవైశ్య పెద్దలు అన్నారు. ఈ కార్యక్రమంలో వాసవిక్లబ్ జిల్లా గవర్నర్ వంగవేటి వెంకట గురుమూర్తి, వాసవి క్లబ్ అధ్యక్షులు కాపర్తి మణికంఠ కుమార్, ఆర్యవైశ్య పెద్దలు కందిబండ సత్యనారాయణ, పివిడి ప్రసాద్, వాసా శ్రీనివాస్, చిల్లంచర్ల ప్రభాకర్, కందిబండ మంగేష్, నల్లపాటి నాగరాజు, చక్క కిషోర్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.