తొలగించిన హోంగార్డుల మెరుపు సమ్మె
కుటుంబాలతో రోడ్డుపై బైఠాయింపు
పెట్రోల్ బాటిల్తో ఒకరు హోర్డింగ్పై నిరసన
భారీగా ట్రాఫిక్ జామ్…ఉద్రిక్తత
హైదరాబాద్,మే14(జనంసాక్షి ): ఉమ్మడి ఎపిలో తమను ఉద్యోగాల నుంచి అకారణంగా తొలగించినందున.. వెంటనే తిరిగి విధుల్లోకి తీసుకోవాలంటూ కొందరు ¬ంగార్డులు కుటుంబసభ్యులతో కలిసి హైదరాబాద్లో మెరుపు ఆందోళనకు దిగారు. ఉద్యోగం కోల్పోయిన ఓ ¬ంగార్డు ఖైరతాబాద్లో పెట్రోఎల్ సీసాతో హార్డింగ్పైకి ఎక్కడంతో ట్రాఫిక్ జామ్ అయ్యింది. మరికొందరు తమ కుటుంబసభ్యులతో కలిసి రోడ్డుపై ఎండలో పిల్లలతో సహా బైఠాయించారు. దీంతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్ భారీగా నిలిచిపోయింది. బురాన్గౌడ్ అనే ¬ంగార్డు ఖైరతాబాద్ చౌరస్తా సవిూపంలోని ¬ర్డింగ్ పైకి ఎక్కాడు. ఉమ్మడి రాష్ట్రంలో అర్డర్ కాపీలు లేవన్న కారణం చూపుతూ దాదాపు 400 మందిని ఉద్యోగాల నుంచి తొలగించారని ¬ంగార్డులు వాపోయారు. యూనిఫామ్ ఇచ్చి… జీతాలు ఇస్తూ… గుర్తింపు కార్డులు ఉన్నా ఉద్యోగాల నుంచి ఎలా తొలగించారని వారు ప్రశ్నించారు. తొలగించిన ¬ంగార్డులను వెంటనే విధులలోకి తీసుకోవాంటూ గత మార్చిలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పినా ఇంత వరకు ఏ ఒక్క అధికారి స్పందించలేదని మండిపడ్డారు. తమకు స్పష్టమైన హావిూ ఇచ్చేవరకు ఇక్కడి నుంచి వెళ్లేది లేదని వారు స్పష్టం చేశారు. బలవంతంగా తమను ఇక్కడి నుంచి తరలిస్తే.. ఇంటికి వెళ్లి కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకుంటామని ¬ంగార్డులు హెచ్చరించారు. తమకు న్యాయం చేయాలంటూ పెట్రోల్ బాటిల్ తో ¬ర్డింగ్ ఎక్కడంతో ఈ సంఘటన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. అకారణంగా వారిని విధుల నుంచి తొలగించడంపై ¬ంగార్డుల్లో తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. తిరిగి తమను విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ నగరంలోని ఖైరతాబాద్ ్గ//-ల ఓవర్ పక్కన ఉన్న ¬ర్డింగ్ దగ్గర నిరసన తెలుపుతున్నారు. మహబూబ్నగర్కు చెందిన బురాన్ గౌడ్ పెట్రోల్ బాటిల్ను తీసుకుని ¬ర్డింగ్ ఎక్కడంతో అక్కడ కలకలం రేగింది. దీంతో ఆ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ జామైంది. ఖైరతాబాద్ నుంచి నె/-లకెస్రోడ్డువైపు వెళ్లే మార్గాన్ని మొత్తం పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. దీంతో ఆ వైపుగా వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కొద్ది గంటలుగా ట్రాఫిక్ ముందుకు కదలడం లేదు. అసలే సోమవారం.. ఆపై ఎప్పుడూ రద్దీగా ఉండే ఖైరతాబాద్ సర్కిల్ కావడంతో వేల సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. అతన్ని కిందికి దించడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు.