తొలి టీ20 మ్యాచ్‌కు బౌల్ట్‌ దూరం!

కైస్ట్ర్‌ చర్చ్‌,నవంబర్‌13(జ‌నంసాక్షి): స్వదేశంలో వెస్టిండీస్‌తో జరిగే టీ20 సిరీస్‌కు న్యూజిలాండ్‌ స్పీడ్‌స్టర్‌ ట్రెంట్‌ బౌల్ట్‌ దూరంకానున్నాడు. నవంబర్‌ 27 నుంచి ఆతిథ్య కివీస్‌, విండీస్‌ మధ్య టీ20 సిరీస్‌ ఆరంభంకానుంది. ఐపీఎల్‌లో ఆడిన కివీస్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌, లాకీ ఫర్గుసన్‌, మిచెల్‌ సాంట్నర్‌, జివ్మిూ నీషమ్‌, టిమ్‌ సీఫర్ట్‌, బౌల్ట్‌ స్వదేశానికి తిరిగి వచ్చారు. వీరంతా 14 రోజుల పాటు ఐసోలేషన్‌లో ఉంటారు. ఐతే బౌల్ట్‌ మొదటి టీ20 మ్యాచ్‌ అడేది అనుమానంగా మారింది. ముంబై ఇండియన్స్‌ ఐదోసారి టైటిల్‌ నెగ్గడంలో బౌల్ట్‌ కీలకపాత్ర పోషించాడు.