దళిత సిఎంపేరుతో దగా చేశారు: మందకృష్ణ

indexనిజామాబాద్‌,జూన్‌2(జ‌నంసాక్షి): దళిత ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పిన సిఎం కెసిఆర్‌ దళితులను దగా చేశారని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆరోపించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ దళితులను మోసం చేసి అధికారంలోకి వచ్చారని అన్నారు.  తెలంగాణ అవతరణ తరవాత కూడా మళ్లీ దొరల పాలనగా సాగుతోందని అన్నారు. రాష్ట్రం మొత్తం కేసీఆర్‌ కుటుంబం కనుసన్నల్లోనే నడుస్తోందన్నారు. ఆదాయం వచ్చే పదవులన్నీ కొడుకు, అల్లుడు చేతుల్లో పెట్టారని విమర్శించారు. రాజయ్యను అకారణంగా పదవిలోంచి తొలగించారని అన్నారు. రిజర్వేషన్లు ఉమ్మడి రాష్ట్రంలో మాదిరిగానే కొనసాగుతున్నాయని, వెంటనే వర్గీకరణ చేపట్టాలని డిమాండ్‌ చేశారు. మంత్రివర్గంలో సైతం దళితులకు తీవ్ర అన్యాయం చేశారన్నారు. వేడుకల సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని కార్యకర్తలకు పిలుపునివ్వడంతో అంతటా నిరసనలు చేస్తున్నామని అన్నారు. దీనికి ప్రజలు కూడా స్పందించారని అన్నారు.  ప్రభుత్వ వైఖరిపై, రాష్ట్ర ముఖ్యమంత్రిపై ఆయన తీవ్రంగా విరుచుకుపడ్డారు. తను అధికారంలోకి వచ్చేందుకు దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని ఆశ చూపారని ఆరోపించారు. ఆదిలాబాద్‌లో పర్యటనకు వచ్చిన మందకృష్ణ వెళుతూ దారిలో కొద్దిమంది విూడియామిత్రులతో మాట్లాడారు.