దివ్యసాకేతంలో సిఎం కెసిఆర్‌

రంగారెడ్డి,నవంబర్‌10(జ‌నంసాక్షి): శంషాబాద్‌లోని దివ్యసాకేతాన్ని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు శనివారం మధ్యాహ్నం సందర్శించారు. దివ్యసాకేతంలో సీఎం కేసీఆర్‌ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ చిన జీయర్‌ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. ఆయనకు స్వాగతం పలికి ఆశిస్సులు అందించారు. సిఎం వెంట ఎంపి సంతోష్‌ కుమార్‌ కూడా ఉన్నారు.