దుబాయిలో భారత యువ వాద్యకారుడి మృతి

దుబాయి,డిసెంబర్‌15(జ‌నంసాక్షి):   భారత యువ గిటార్‌ వాద్యకారుడు హిమాన్షు శర్మ(22) దుబాయిలో మృతి చెందారు. గర్‌హౌద్‌లోని అపార్టుమెంట్‌లో ఆయన మృతదేహాన్ని శుక్రవారం కనుగొన్నారు. ఆయన మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. మణిపాల్‌ అకాడెవిూలో ఆర్కిటెక్చర్‌ కోర్సు చేస్తున్న హిమాన్షు ‘మహే దుబాయి క్యాంపస్‌’లో అయిదో ఏడాది ఇంటెర్న్‌షిప్‌నకు హాజరవుతున్నారు. దుబాయి బ్యాండ్‌ ‘మెటల్‌ హెడ్‌’ సంగీత కార్యక్రమాల ద్వారా గిటార్‌ వాద్యకారుడిగా పేరు సంపాదించారు. ‘స్లేవ్స్‌ ఆఫ్‌ కాన్‌స్పిరసీ’, ‘నట్‌మెగ్‌’ తదితర బ్యాండ్‌ల కార్యక్రమాలతో అలరించినట్లు సహచర సంగీత కళాకారుడు గౌరవ్‌మానా తెలిపారు. హిమాన్షు మృతి వార్తతో విశ్వవిద్యాలయంలో విషాదఛాయలు అలుముకున్నాయి.