దేశంలో రాబోయేది.. ఏపీకి ¬దా ఇచ్చే ప్రభుత్వమే


– ఢిల్లీలో దీక్ష ప్లాప్‌ షో అనడం విడ్డూరం
– ¬దాకోసం ఎవరూ ఆత్మహత్య చేసుకోవద్దు
– రాష్ట్రంలో భాజపా చచ్చిన పాము లాంటిది
– బురద పాము లాంటి వైకాపా.. భాజాపాతో కలిసి కుట్రలు పన్నుతోంది
– ఈ విషయాన్నే ప్రజల్లోకి తీసుకెళ్లండి
– టెలికాన్ఫరెన్స్‌లో ఏపీ సీఎం చంద్రబాబు
న్యూఢిల్లీ, ఫిబ్రవరి12(జ‌నంసాక్షి) : వచ్చే ఎన్నికల తరువాత దేశంలో రాబోయేది ఏపీకి ¬దా ఇచ్చే ప్రభుత్వమేనని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. మంగళవారం ఢిల్లీ నుండి చంద్రబాబు టీడీపీ ముఖ్యనేతలతో టెలీకాన్ఫరెన్స్‌లో మాట్లాడారు..  ఢిల్లీలో జరిగిన ధర్మపోరాట దీక్ష  ప్లాప్‌ అనడం రాష్ట్ర ద్రోహమని చంద్రబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 17పార్టీల ప్రతినిధులు పాల్గొనడం ప్లాప్‌షోనా అంటూ మండిపడ్డారు. లేక దేశవ్యాప్తంగా మద్దతు కూడగట్టడం ప్లాప్‌ షో నా..? అని సీఎం ప్రశ్నించారు. బీజేపీ, వైసీపీలు కుమ్మక్కై ధర్మపోరాట దీక్షను విరమ్శిస్తున్నాయని చంద్రబాబు మండిపడ్డారు. బీజేపీ, వైసీపీ మినహా అన్ని పార్టీల మద్దతు ఏపీకేని చెప్పుకొచ్చారు. శ్రీకాకుళం జిల్లా వాసి అర్జున్‌రావు ఆత్మహత్య బాధాకరమన్నారు. ¬దా కోసం ఎవరూ ఆత్మహత్య చేసుకోవద్దని వినతి చేశారు. ఢిల్లీలో రాబోయేది ఏపీకి ¬దా ఇచ్చే ప్రభుత్వమే అని చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రధానికి మనం గౌరవం ఇవ్వలేదని వైకాపా నేతలు మాట్లాడడం వైకాపా, భాజపాల బంధాన్ని బయటపెట్టిందని వ్యాఖ్యానించారు. ఆంధ్రాభవన్‌ ఎప్పుడూ జాతీయ రాజకీయాలకు వేదికగా ఉంటుందన్నారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని ధర్మపోరాట దీక్ష ద్వారా దేశం గుర్తించిందని తెలిపారు. ప్రధాని రాష్ట్రానికి చేసిన మోసాన్ని అంతా గుర్తించారని పేర్కొన్నారు. భాజపాను ఎండగట్టడంలో దీక్ష ద్వారా సఫలమయ్యామని నేతలకు వివరించారు. పోరాటాన్ని ఆపకుండా ఇక్కడ నుంచి ప్రజల్లోకి వెళ్లి పోరాడాలన్నారు. రాష్ట్ర భవిష్యత్‌ను జగన్‌ తాకట్టు పెడుతున్న తీరును ప్రజాక్షేత్రంలో ఎండగట్టాలన్నారు. రాష్ట్రంలో భాజపా చచ్చిన పాము లాంటిదని, దాన్ని ఇంకా కొట్టి లాభం లేదన్నారు. బురద పాము లాంటి వైకాపా భాజాపాతో కలిసి కుట్రలు పన్నుతోందని, దీన్నే మనం ప్రజల్లోకి తీసుకు వెళ్లాలన్నారు.