దోపిడీ దొంగల బీభత్సం

రంగారెడ్డి,అక్టోబర్‌29(జనం సాక్షి ): శంషాబాద్‌ మండలంలోని పెద్దషాపూర్‌ గ్రామంలో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. సోమవారం అర్ధరాత్రి రెండు నివాసాల్లోకి ప్రవేశించిన దొంగలు.. ఐదు తులాల బంగారం, రూ. 30 వేల నగదును దోచుకెళ్లారు. బాధిత కుటుంబ సభ్యులు శంషాబాద్‌ రూరల్‌ పోలీసులకు
ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు చోరీ జరిగిన నివాసాలను పరిశీలించారు. గ్రామ పరిసరాల్లో పోలీసులు తనిఖీలు చేస్తున్నారు.