ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు

నేరుగా ఖాతాల్లోకి డబ్బులు జమ

గన్నీబ్యాగుల కొరత లేకుండా చర్యలు

మెదక్‌,అక్టోబర్‌26(జ‌నం సాక్షి): ఖరీఫ్‌లో ధాన్యం కోనుగోళ్లకు రంగం సిద్దం చేశారు. రైతుల ఖాతాల్లోకే నేరుగా డబ్బు జమచేస్తారు. ఖాతాలులేని రైతులకు తక్షణం ఖాతాలు తెరిపించాలని కలెక్టర్‌ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఆధ్వర్యంలో 1, ఐకేపీ ఆధ్వర్యంలో కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వివరించారు. జిల్లాలో రైతులు పండించిన ధాన్యానికి మద్దతు ధర అందించేందుకు అన్ని చర్యలు చేపట్టినట్లు తెలిపారు. అలాగే మొక్కజొన్నల కొనుగోలుకు జిల్లా వ్యాప్తంగాకొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మొక్కజొన్నలకు ప్రభుత్వం మద్దతు ధర నిర్ణయించిందని, రైతులు నాణ్యత ప్రమాణాలు పాటించి ఆ ధర పొందాలని సూచించారు.రైతులు మార్గదర్శకాల ప్రకారం 17 శాతంలోపు తేమ ఉండేలా ధాన్యాన్ని ఆరబెట్టి, శుభ్రపరచి కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించిన రైతులకు 48 గంటల్లోనే డబ్బులు చెల్లించనున్నట్లు తెలిపారు. బ్యాంకు ఖాతాలు ఉన్న రైతులు తమ ఖాతా నెంబర్లు అందజేయాలని, ఖాతాలు లేనివారు తెరవాలని సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో అవసరమైన మౌలిక వసతులన్ని కల్పించాలని సంబంధిత అధికారులను

ఆదేశించినట్లు తెలిపారు. కేంద్రాలకు ధాన్యం తీసుకువచ్చిన రైతులకు ఇబ్బందులు కలుగకుండా టోకెన్లు జారీ చేయాలని తెలిపారు. రైతులను దళారుల నుంచి కాపాడేందుకు జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో అయిదు కి.విూ.కు ఒకటి చొప్పున ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేసేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని వెల్లడించారు. పాత జిల్లాలో కంటే కొత్త జిల్లాలో రెట్టింపు సంఖ్యలో కేంద్రాలను ప్రారంభించడానికి చొరవ తీసుకున్నారని తెలిపారు. ఎక్కడైనా రైతులను వేధించినా, మోసం చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. నిర్వాహకులు పారదర్శకంగా వ్యవహరించాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులు పండించిన వరి ధాన్యానికి మద్దతు ధర ప్రకటించి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది. రైతులను ఆర్థికంగా ఆదుకోవాలనే లక్ష్యంగా ప్రభుత్వం వారికి అండగా నిలుస్తుంది. వరికి మద్దతు ధర ఏగ్రేడ్‌కు రూ.1770, సాధారణ రకానికి రూ.1750 ప్రకటించింది. అంతేకాకుండా జిల్లా వ్యాప్తంగా ప్రారంభించిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో గన్ని బస్తాల కొరుత లేకుండా మార్కెటింగ్‌ శాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. రబీలో లక్షా 25వేల మెట్రిక్‌ టన్నుల వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇందుకు తగ్గట్టుగానే జిల్లా వ్యాప్తంగా వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏ ర్పాటు చేశారు. రైతులు కూడా పండించిన పంటలను దళారులకు కాకుండా నేరుగా ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తరలిస్తున్నారు. గతంలో ఏ ప్రభుత్వాలు కూడా రైతులు పండించిన పంటలకు మద్దతు ధర ప్రకటించలేదని, కొనుగోలు కేంద్రాలను కూడా ఏర్పాటు చేయలేదని రైతులు వాపోతున్నారు.