ధాన్యం కొనుగోళ్లో రైతులకు తప్పని తిప్పలు

మార్కెట్లలో ఎప్పటిలాగే అవస్థలు

నల్గొండ,అక్టోబర్‌26(జ‌నం సాక్షి): ధాన్యం కొనుగోలులో రైతులను ఎలాంటి ఇబ్బందులకు గురి చేయకుండా ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. దీంతో జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు 24వేల టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని కలెక్టర్‌ గౌరవ్‌ ఉప్పల్‌ తెలిపారు. జిల్లాలో పత్తి కొనుగోలు కేంద్రాలకు పలుచోట్ల అనువైన ప్రాంతాలను ప్రతిపాదించారు. చండూరు, వెంకటేశ్వరనగర్‌, దేవరకొండ, మిర్యాలగూడ, చిట్యాల, హాలియా, నకిరేకల్‌ కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపించామన్నారు.పత్తి కొనుగోలు కోసం మొదటి దశలో మూడు ప్రాంతాల్లో కేంద్రాలు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. రైతులకు గిట్టుబాటు అందేలా చూడాలని అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు. అయితే ధాన్యం కొనుగోళ్ల సందర్భంగా తరుగు పేరుతో రైతులపై అదనపు ధాన్యం భారం వేస్తున్నారు. మార్కెట్‌యార్డుకు ధాన్యం తీసుకొచ్చిన రైతులు రోజుల తరబడి నిరీక్షిస్తూ అవస్థలు పడుతున్నారు. 40 కిలోల ధాన్యం బస్తాకు అదనంగా కిలో ధాన్యం ఉచితంగా ఇవ్వాలని ఇందులో అరకిలో గన్నీ సంచి బరువు కాగా.. మరో అరకిలో తరుగు వస్తున్నందున ఆ భారం కూడా రైతులదేనని అధికారులు స్పష్టం చేయడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. 40కిలోలకు 800 గ్రాముల ధాన్యం ఉచితంగా ఇచ్చేందుకు అంగీకరించక తప్పని పరిస్థితులు ఏర్పడ్డాయి. ధాన్యం కొనుగోలు ప్రారంభానికి ముందే అధికారులు క్షేత్రస్థాయిలో అన్ని ఏర్పాట్లు చేయాల్సి ఉన్నా..అవి కానరావడంలేదు. ధాన్యం నమూనాలు పరిశీలించడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఫలితంగా కొనుగోలు ఆలస్యమవుతున్నాయి. ఇదిలావుంటే

కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకొచ్చిన రైతులను అడుగుడునా అవస్థలపాలుచేస్తున్న ప్రభుత్వానికి

రైతుల ఉసురు తగులుతుందని సీపీఎం నాయకుడు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు. ధాన్యంతెచ్చిన రైతులు 15 రోజులుగా నిరీక్షిస్తున్నారోజుకో కొర్రీపెడుతూ కొనుగోలు చేయకుండా

ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. 40కిలోలకు అదనంగా ఒక కిలో ధాన్యం ఇస్తేనే కొనుగోలు చేస్తామని రైతులపై ఒత్తిడి తెస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అతివృష్టి, అనావృష్టివల్ల పంటలు నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని డిమాండ్‌చేశారు.