ధాన్యం తరలింపునకు చర్యలు

నిజామాబాద్‌,మే24(జ‌నం సాక్షి): ధాన్యం నిల్వలు పేరుకుపోకుండా కొనుగోలు కేంద్రాల నుంచి ప్రతి రోజు ధాన్యాన్ని తరలించేలా చూస్తానని జెసి  హావిూ ఇచ్చారు. రోహిణికార్తె దగ్గర పడిందని ఈ కార్తెలో అకాల వర్షాలు పడే అవకాశం ఉంటుందన్నారు. ధాన్యాన్ని వీలైనంత ఎక్కువగా సేకరించి త్వరగా పూర్తి చేయాలన్నారు. కేంద్రాల్లో ధాన్యం పేరుకుపోవడంతో రైతుల నుంచి తీవ్ర ఇబ్బందుల ను ఎదుర్కొంటున్నామని సొసైటీల చైర్మన్లు  జేసీ దృష్టికి తీసుకువచ్చారు. దీంతో జేసీ స్పందించి వర్షాకాలం సవిూపిస్తున్నందున రైతుల నుంచి ధాన్యాన్ని త్వరగా సేకరించాలని అన్నారు. అలాగే సేకరించిన ధాన్యాన్ని తరలించాలన్నారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం నిల్వ లు పేరుకుపోకుండా కూలీలను, సంచులను, లారీలను పెంచాలన్నారు.