ధూంధాంగా కొత్త పంచాయితీల ఆవిర్భావోత్సవం

ఆదిలాబాద్‌,ఆగస్ట్‌1(జ‌నంసాక్షి): ఇక ఆదిలాబాద్‌ స్వరూపం మారిపోనుంది. కొత్త పంచాయితీలతో పాటు పాత పంచాయితీల్లో సర్పంచ్‌ల పాలన ముగిసి, కార్యదర్శుల పాలనా కార్యకలాపాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో  నేడు ఆవిర్భావ వేడుకలు జరుగనున్నాయి. పంచాయితీల ప్రారంభోత్సవాలకు పెద్ద ఎత్తున ప్రజలు హాజరయ్యేలా ఏర్పట్లు చేస్తున్నారు. ధూమ్‌ధామ్‌గా ఏర్పాట్లు చేసేలా జిల్లాకుచెందిన ఇద్దరు మంత్రులు పర్యవేక్షిస్తున్నారు. పెద్దెత్తున బాణాసంచా కాల్చడం, సాంస్కృతక కార్యక్రమాలు చేపట్టేందుకు పురమాయించారు. వీటికి కేటాయించిన భవనాల ముస్తాబు వేగవంతంగా జరుగుతుంది.మరోవైపు ఫర్నీచర్‌ సర్దుబాటు చేస్తున్నారు. వీటితో పాటు భవనాలకు రంగులు వేయిస్తున్నారు. ప్రత్యేకాధికారుల పరిపాలన ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించడంతో శరవేగంగా పనులు సాగుతున్నాయి. పెద్ద ఎత్తున సంబరాలు చేయనున్నారు