నలుగురు క్రికెట్‌ బెట్టింగ్‌ రాయుళ్ల అరెస్టు

హైదరాబాద్‌,మార్చి02(జ‌నంసాక్షి): క్రికెట్‌ బెట్టింగ్‌లకు పాల్పడుతున్న నలుగురు వ్యక్తులను హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీ కాలనీలో సోమవారం పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.24వేలు, 16 సెల్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌ స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.