నలుగురు దొంగల అరెస్టు

మహబూబాబాద్‌,సెప్టెంబర్‌1(జ‌నంసాక్షి): మహబూబాబాద్‌ జిల్లాలో పలు మండల కేంద్రాల్లో చోరీలకు పాల్పడిన నలుగురు అంతర్‌ జిల్లా దొంగలను పోలీసులు అరెస్ట్‌ చేశారు. వారి నుంచి 18 తులాల బంగారం, 10 తులాల వెండి, 2 బైక్‌లు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.