నవిపేటలో 200 కేజీల గంజాయి పట్టివేత

నిజామాబాద్  : నవిపేట మండలం జన్నేపల్లి వద్ద పోలీసులు 200 కేజీల గంజాయిని పట్టుకున్నారు. ఓ కారులో విశాఖపట్నం నుంచి డిల్లీ తరలిస్తుండగా పోలీసులు వెంబడించి పట్టుకున్నారు. వారి నుంచి కారు, రూ.6.8 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురుని అరెస్ట్ చేసినట్లు, మరో ఇద్దరు పరారైనట్లు నిజామాబాద్ ఎస్పీ విశ్వప్రసాద్ వెల్లడించారు.