నవోదయ ఎంట్రెన్స్ పరీక్షకు దరఖాస్తులు

ఎల్లారెడ్డి అక్టోబర్ 15 (జనంసాక్షి) :
ఎల్లారెడ్డి:జవహర్ నవోదయ విశ్వవిద్యాలయంలో 6వ తరగతి నుండి 12 వ తరగతి వరకు సిబిఎస్ ఐ విధ్యానభ్యసించేందుకు ప్రవేశ పరీక్ష ప్రకటన వెలువడిందని ఎల్లారెడ్డి విద్యాశాఖ అధికారి వెంకటేశం అన్నారు.నవోదయ ఎంట్రెన్స్ 6వ తరగతి ప్రవేశం కోరాకు 2018-19 విద్య సంవత్సరం 5వ తరగతి ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన విద్య సంస్థలో చదువుతుండేవారు అర్హులులని ఆయన తెలిపారు.వీరు 1-05-2006 మధ్య 30-04-2010 లో జన్మించి ఉండాలని ఈ నెల 1 నుండి దరఖాస్తులు ప్రారంభంయ్యాయని,ఈ నెల 30న చివరి తేదీ అని వచ్చే సంవత్సరం మార్చి 30 తేదీన ప్రవేశపరీక్ష ఉంటుందని దరఖాస్తు చేసుకునేవారు నవోదయ వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు ఫారాలను పొంది,విద్యార్థి యొక్క మిడియంను ముందుగా తెలిపి ఆయా పాఠశాల ప్రధానోపాధ్యాయునిచే పురించి సంతకం చేయించి.ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని ఆయన పేర్కొన్నారు.