నాగర్ కర్నూల్ కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం రసాభాస

మహబూబ్ నగర్: నాగర్ కర్నూలులో మండల కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం రసాభాసగా మారింది. మండల కాంగ్రెస్ కార్యకర్తల వల్లభరెడ్డి, హబీబ్, గౌస్ లను పార్టీ నుంచి సస్పెండ్ చేయడంతో వారి అనుచరులు గొడవకు దిగారు. ఎంపి నంది ఎల్లయ్య ముందే నాయకులు, కార్యకర్తలు ఘర్షణకు దిగడంతో కొంతమంది కార్యకర్తలకు గాయాలయ్యాయి.