నాగారంలో పిచ్చికుక్కల స్వైరవిహారం

కీసర: రంగారెడ్డి జిల్లా కీసర మండలం నాగారం గ్రామ పంచాయతీ శివనగర్‌లో వీధి కుక్కలు రెచ్చిపోయాయి. కుక్కల గుంపు బుధవారం ఉదయం శివనగర్ లో భీభత్సం సృష్టించింది.  రోడ్డుపై వెళ్తున్న వారిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. కుక్కల దాడిలో ముగ్గురికి గాయాలయ్యాయి. స్థానికులు బాధితులను దగ్గరలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.