నాపై ఫిర్యాదు చేసేందుకు..
ఢిల్లీ వెళ్లారని అనుకోవడం లేదు
కాంగ్రెస్లోకొచ్చేందుకు తెరాస, బీజేపీ నేతలు రెడీగా ఉన్నారు
పంచాయతీరాజ్ చట్టానికి విరుద్దంగా రిజర్వేషన్లు ఉన్నాయి
టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్రెడ్డి
హైదరాబాద్, జూన్20(జనం సాక్షి ) : తనపై ఫిర్యాదు చేసేందుకే తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఢిల్లీ వెళ్లారని అనుకోవడం లేదని పీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్రెడ్డి చెప్పారు. రాహుల్గాంధీకి బర్త్డే విషెస్ చెప్పడానికే ఢిల్లీ వెళ్లారని తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్లోకి వచ్చేందుకు టీఆర్ఎస్, బీజేపీ, టీడీపీ నుంచి నేతలు రెడీగా ఉన్నారని చెప్పుకొచ్చారు. స్థానిక నేతలతో మాట్లాడుతున్నామని.. త్వరలోనే చేరికలుంటాయని స్పష్టం చేశారు. పంచాయతీ రిజర్వేషన్లు అస్థవ్యస్థంగా ఉన్నాయని ఆరోపించారు. ఇందులో ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుందన్నారు. పంచాయతీరాజ్ చట్టానికి విరుద్దంగా రిజర్వేషన్లు ఉన్నాయని విమర్శించారు. పంచాయతీ రిజర్వేషన్లపై త్వరలో మండలస్థాయి నేతలతో సమావేశం నిర్వహిస్తామన్నారు. పంచాయతీ ఎన్నికలను ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ సిద్ధంగా ఉందని ప్రకటించారు. గ్రామాల్లో టీఆర్ఎస్కు అడ్రస్ లేదని వ్యాఖ్యానించారు. సమగ్ర కుటుంబ సర్వే రిపోర్ట్ను ఎందుకు బయటపట్టడం లేదని నిలదీశారు. దీనికి ముఖ్యమంత్రి కేసీఆర్ సమాధానం చెప్పాలని ఉత్తమ్ డిమాండ్ చేశారు.
నినినినినినినినినినినిని