నామాను భారీ మెజార్టీతో గెలిపిద్దాం: కొండబాల

ఖమ్మం,మార్చి26(జ‌నంసాక్షి): ఖమ్మం పార్లమెంట్‌ అభ్యర్థి నామా నాగేశ్వరరావుకి సుమారు రెండు లక్షల మెజార్టీతో గెలుపు తథ్యమని విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్‌ కొండబాల కోటేశ్వరరావు అన్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీ 16 ఎంపీలను గెలుచుకుని కేంద్రంలో చక్రం తిప్పడం తథ్యమని, అప్పుడే జాతీయస్థాయిలో తెలంగాణకు ప్రత్యేక గుర్తింపు సాధ్యమన్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీలో నాయకులు, కార్యకర్తలకు సమప్రాధాన్యం ఉంటుందని చెప్పారు. గతంలో కాంగ్రెస్‌ ఎంపిలు చేసిందేవిూ లేదన్నారు. నామా రావడంతో ఇప్పుడు కొత్త ఉత్తేజం వచ్చిందని అన్నారు. టీఆర్‌ఎస్‌లో ప్రతీ కార్యకర్తకు, నాయకులకు అండగా ఉంటానని అన్నారు. రెండు పార్లమెంట్‌ స్థానాలతోనే తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకువచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌దే అని కొనియాడారు. ఒకేసారి 16 ఎంపీ స్థానాలు గెలిపించి సీఎంకు అందిస్తే దేశ రాజకీయాలలో టీఆర్‌ఎస్‌ పార్టీ కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు.  రైతుల సంక్షేమ పథకాలు దేశానికే దిక్సూచిలా ఉన్నాయని, భారీ మెజార్టీతో ఖమ్మంలో ఎంపీగా గెలిపిస్తే ప్రజల వాణిని పార్లమెంట్‌లో గట్టిగా వినిపిస్తారని అన్నారు. కాంగ్రెస్‌, బీజేపీలు దేశాన్ని భ్రష్టు పట్టించాయని, సీఎం కేసీఆర్‌ నేతృత్వంలో బంగారు తెలంగాణను నిర్మించుకుందా మని పేర్కొన్నారు.  తెలంగాణ రాష్ట్ర పార్టీ అధినేత సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు ప్రతీ ఒక్కరు నడుచుకుందామని ఎంపి ఎన్నికల్లో భారీ మెజార్టీ లక్ష్యంగా పనిచేద్దామని అన్నారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో సైతం మరోమారు టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థి గెలుపునకు పార్టీ శ్రేణులు కృషి చేయాలని కోరారు. తెలంగాణ ఉద్యమ సమయంలో చేసిన పోరాటం మాదిరిగా కార్యకర్తలు, నాయకులు కష్టపడి ఖమ్మం పార్లమెంట్‌ స్‌థ్ధానాన్ని భారీ మెజార్టీతో గెలిపించి సీఎం కేసీఆర్‌కు కానుక అందించాలన్నారు.