నామినేషన్ల పక్రియ ప్రారంభం

ఖమ్మంనవంబర్‌12(జ‌నంసాక్షి): ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల కావడంతో ఖమ్మం నియోజక వర్గ అసెంబ్లీ ఎన్నికల నామినేషన్లు దాఖలు చేసేందుకు ఖమ్మం అర్బన్‌ తహసీల్దారు కార్యాలయాన్ని సిద్ధం చేశారు. ఇప్పటి వరకు నామినేషన్లు దాఖలు కాలేదని రిటర్నింగ్‌ అధికారి శ్రీనివాసరావు సోమవారం తెలిపారు. ఏసీపీ వెంకటరావు ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తును నిర్వహిస్తున్నారు. పాలేరు అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల కోసం ఖమ్మం తహసీల్దారు కార్యాలయంలో అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. ఈ రోజు ఉదయం 11గంటల నుంచి నామినేషన్ల పక్రియ ప్రారంభమైనట్లు రిటర్నింగ్‌ అధికారి దశరథ తెలిపారు. ఇప్పటి వరకు నామినేషన్లు ఏవీ దాఖలు కాలేదన్నారు. నామినేషన్లు దాఖలు చేయాల్సిన కేంద్రానికి 100 విూటర్ల దూరంలోనే వాహనాలను నిలిపేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా పోలీసులు గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు.