నామినేషన్ వేసిన మదన్ రెడ్డి
మెదక్,నవంబర్17(జనంసాక్షి): ల్లా నర్సాపూర్ టీఆర్ఎస్ అభ్యర్థి మదన్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా నర్సాపూర్ లో మదన్ రెడ్డికి మద్దతుగా భారీ ప్రదర్శన నిర్వహించారు. వేల మంది గులాబీ జెండాలు పట్టుకొని, టీఆర్ఎస్ కండువాలు మెడలో వేసుకొని ప్రదర్శనలో పాల్గొన్నారు. దీంతో, నర్సాపూర్ పట్టణం గులాబీమయం అయ్యింది. ఈ కార్యక్రమంలో మంత్రి హరీశ్ రావు, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డి, టీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు.