నాయిని పట్టువీడాలి: రేవూరి

వరంగల్‌,నవంబర్‌14(జ‌నంసాక్షి): నాయని రాజేందర్‌రెడ్డితో తనకు ఎలాంటి వైరం లేదని టీడీపీ నేత రేవూరి ప్రకాశ్‌ రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం ఆయన విూడియాతో మాట్లాడుతూ నాయినికి సముచితస్థానం కల్పించేందుకు తన వంతు కృషిచేస్తానని అన్నారు. టీఆర్‌ఎస్‌ను ఓడించేందుకే వరంగల్‌లో మరో సీటు కోసం పట్టుబట్టలేదని ఆయన అన్నారు. వరంగల్‌ వెస్ట్‌లో కొన్ని ప్రాంతాల్లో ప్రశాంతంగా జీవించలేని పరిస్థితులు ఉన్నాయని రేవూరి పేర్కొన్నారు. కేవలం తమకు కేటాయించిన సీటులో నాయిని పోటీ చ ఏయడం భావ్యం కాదని, ఇది మిత్ర ధర్మానికి విరుద్దమని అన్నారు. పొత్తులో కేటాయించిన సీటుపై పట్టుపట్టడం సరికాదన్నారు. వచ్చే ప్రభుత్వంలో నాయినిక తగిన న్యాయం చేస్తామని ప్రకటించారు.