నిండా ముంచిన పార్టీలను నమ్మొద్దు

సిద్దిపేట,అక్టోబర్‌2(జ‌నంసాక్షి): ఏన్నో ఏళ్లుగా ఆధికారంలో ఉండి తెలంగాణ ప్రాంతాన్ని నిండా ముంచిన కాంగ్రెస్‌ పార్టీ నాయకుల మాయ మాటలు నమ్మవద్దని మాజీ ఎమ్మెల్యే రామలింగారెడ్డి అన్నారు. ప్రజలంతా టిఆర్‌ఎస్‌కే ఓటని అంటూ తీర్మానాలు చేస్తున్నారని అన్నారు. గతంలో ఏనాటూ ఇలాంటి ప్రచారాం చూడలేదన్నారు. ఈ సందర్బంగా పలువురు కాంగ్రెస్‌ కార్యకర్తలు టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. వీరికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌ పార్టీ బలోపేతానికి కృషిచేస్తూ, భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని అన్నారు. సీఎం కేసీఆర్‌ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు నచ్చే పార్టీలో చేరినట్లు తెలిపారు.