నిజామాబాద్ లో ఇసుకలారీల పట్టివేత 

నిజామాబాద్ : జిల్లాలోని నిజాంసాగర్ మండలం బొబ్బుగుడిసె చౌరస్తా వద్ద పలు ఇసుక లారీలను సోమవారం ఉదయం పోలీసులు సీజ్ చేశారు. ఇసుక క్వారీలో రూ.14,000 చెల్లించి బిల్లు మాత్రం రూ.1200 తీసుకుని అక్రమాలకు పాల్పడుతున్నట్లు వెల్లడవడంతో పోలీసులు 14 ఇసుక లారీలను సీజ్ చేశారు. వీరిపై పోలీసులు కేసు నమోదు చేసి లారీలను స్టేషన్‌కు తరలించారు.