నిషిత్‌ అంత్యక్రియలు పూర్తి

నెల్లూరు: హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లో జరిగిన రోడ్డుప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ఆంధ్రప్రదేశ్‌ మంత్రి నారాయణ కుమారుడు నిషిత్‌ అంత్యక్రియలు పూర్తయ్యాయి. నారాయణ అంత్యక్రియలు నిర్వహించి కుమారుడి చితికి నిప్పుపెట్టారు. నిషిత్‌ అంత్యక్రియలకు భారీ సంఖ్యలలో ప్రజలు, నారాయణ సిబ్బంది, విద్యార్థులు హాజరై నివాళులర్పించారు.

అంతకుముందు నెల్లూరులోని నారాయణ కళాశాల నుంచి బోడిగాడితోటలోని శ్మశాన వాటిక వరకు నిషిత్‌ అంతిమయాత్ర చేపట్టారు. లోకేశ్‌ సహా పలువురు మంత్రులు, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిషిత్‌కు నివాళులర్పించి అంతిమయాత్రలో పాల్గొన్నారు.