నీటితొట్టెలో శవమై తేలిన బాలుడు

ఖమ్మం, జులై 6 : జిల్లాలోని నేలకొండపల్లిలో నెలరోజుల పసికందు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన కలకలం సృష్టించింది. తల్లి పక్కనే పడుకుని ఉన్న బాబు సమీపంలో ఉన్న నీటితొట్టిలో శవమై కనిపించాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.