నీటి సంపులోపడి బాలుడి మృతి

నల్గొండ : జిల్లాలో విషాదం నెలకొంది. నీటిసంపులో పడి బాలుడు మృతి చెందాడు. యాదగిరిగుట్టలోని బిసి కాలనీలో విజయ్ అనే మూడేళ్ల బాలుడు ఉదయం బ్రెష్ చేసుకుంటూ ఇంటి ఆవరణలో తిరుగాడుతున్నాడు. ఇంటికి సమీపంలో ఓ ఇల్లు నిర్మాణంలో ఉంది. ఆ ఇంటి వద్ద ఉన్న నీటి సంపులో ప్రమాదవశాత్తు పడి బాలుడు మృతి చెందాడు. ఎంతకీ బాలుడు కనిపించకపోవడంతో తల్లిదండ్రులు ఇంటి చుట్టుపక్కల వెతికారు. అర్ధగంట తర్వాత నీటిసంపులో బాలుడి మృతి దేహాన్ని గుర్తించారు. కుమారుని మృతితో తల్లీదండ్రులు, బంధువుల కన్నీరుమున్నీరవుతున్నారు.