నీతి ఆయోగ్‌ సీఎం కేసీఆర్‌తో భేటి

హైదరాబాద్‌,జనవరి 22(జనంసాక్షి):నీతి ఆయోగ్‌ వైస్‌ చైర్మన్‌ డాక్టర్‌ రాజీవ్‌ కుమార్‌, అడ్వయిజర్‌ రవీంద్ర ప్రతాప్‌ సింగ్‌, కన్సల్టెంట్‌ డాక్టర్‌ నమ్రత సింగ్‌ పన్వార్‌, రీసెర్చి ఆఫీసర్‌ కామరాజులతో కూడిన బృందం శుక్రవారం ప్రగతి భవన్‌ లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ ను కలుసుకున్నారు. పలు అంశాలపై చర్చించారు. ఈ చర్చల్లో ఆర్‌ అండ్‌ బి శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్‌ కుమార్‌, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణ రావు తదితరులు పాల్గొన్నారు.