నెక్లెస్‌రోడ్డులో పతంగుల ఉత్సవాలు

eqief6ptహైదరాబాద్: సంక్రాంతి పర్వదినం సందర్భంగా నగరంలోని నెక్లెస్‌రోడ్డులో బాలబాలికలు, యువతీయువకులు పతంగులు ఎగురవేస్తూ కేరింతలు కొడుతూ పతంగుల పండుగను ఆనందోత్సాహాలతో ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ ఉత్సవాలను ఇవాళ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ పతంగిని ఎగురవేసి ప్రారంభించారు. ఈ ఉత్సవ ప్రారంభ కార్యక్రమానికి బీజేపీ నేతలు లక్ష్మణ్, బద్దం బాల్‌రెడ్డి హాజరయ్యారు.