నేటినుంచి జంటనగరాల్లో కెటిఆర్ రోడ్షో
హైదరాబాద్,నవంబర్20(జనంసాక్షి): ఎన్నికల నామినేషన్ల ఘట్టం ముగిసిన దరిమిలా రాష్ట్ర ముఖ్యమంత్రి, టీఆర్ అధినేత సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచారం రాష్ట్రంలో ఉధృతంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. మరోవైపు మంత్రి కేటీఆర్ సుడిగాలి పర్యటనలు కూడా బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. జంటనగరాల్లోని నియోజకవర్గ స్థానాల్లో జరగనున్న టీఆర్ రోడ్ షోలలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించనున్నారు. మంత్రి ప్రచార షెడ్యూల్ ఈ విధంగా ఉంది. 21న ఉప్పల్, మాల్కాజ్గిరి, 22న మహేశ్వరం, ఎల్బీ నగర్, 23న కంటోన్మెంట్, సికింద్రాబాద్ 24న సనత్ జూబ్లీహిల్స్, 26న కుత్భుల్లాపూర్, కూకట్పల్లి, 27న గోషామహల్, ఖైరతాబాద్ 28న శేరిలింగంపల్లి, పటాన్చెర్వు, రాజేంద్రనగర్ 29న అంబర్పేట, ముషీరాబాద్ నియోజకవర్గాల్లో మంత్రి ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఈ ప్రచార కార్యక్రమం సాయంత్రం 4 గంటల నుంచి 7 గంటల వరకు అదేవిధంగా రాత్రి 7 గంటల నుంచి 10 గంటల వరకు కొనసాగనుంది. ఈ మేరకు ఏర్పాట్లు చేస్తున్నారు.