నేడు ఉద్యోగ మేళా

నల్గొండఫిబ్రవరి20(జ‌నంసాక్షి):  గ్రావిూణ ప్రాంతాల్లోని నిరుద్యోగ యువతకు ప్రైవేట్‌ పరిశ్రమల్లో ఉద్యోగం కల్పించేందుకు ఈ నెల 21న టీటీడీసీలో ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు డీఆర్‌డీవో పీడీ శేఖర్‌రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. నెక్సా మోటార్స్‌ నల్గొండ, అపోలో ఫార్మసీ, పేరం గ్రూప్‌ రియల్‌ ఎస్టేట్‌, వరుణ్‌ మోటార్స్‌, గ్లోబల్‌ సర్వీసెస్‌ కంపెనీల్లో 510 ఉద్యోగాలను భర్తీ చేయడం జరుగుతుందన్నారు. ఉద్యోగాలకు ఎంపికైన వారు నల్గొండ, సూర్యాపేట, భువనగిరి, హైదరాబాద్‌ ప్రాంతాల్లో పని చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఇంటర్‌, డిగ్రీ, బీటెక్‌, బి.ఫార్మసీ, ఎం.ఫార్మసీ, డి.ఫార్మసీ, పదో తరగతి, ఐటీఐ, ఎంబీఏ చదివిన వారు ఆయా కంపెనీల్లోని ఉద్యోగాలకు అర్హులన్నారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు అర్హత పత్రాలతోపాటు రేషన్‌కార్డు, ఆధార్‌ కార్డు జిరాక్స్‌ పత్రాలతో నేరుగా ఇంటర్వ్యూకు హాజరు కావాలన్నారు.