నేడు ట్రస్మా ఆధ్వర్యంలో సభ

కరీంనగర్‌,ఫిబ్రవరి9(జ‌నంసాక్షి): తెలంగాణ గుర్తింపు పొందిన పాఠశాలల యాజమాన్యం(ట్రస్మా) ఆధ్వర్యంలో ఈ నెల 9న ఎస్సారార్‌ కళాశాల గ్రౌండ్‌లో బహిరంగ మహాసభను ఏర్పటు చేశారు.  సమావేశంలో ప్రైవేటు విద్యాసంస్థలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఒక అర్థవంతమైన చర్చ జరిపి సమస్యల సాధనకు తగు సూచనలతో మన ప్రజాప్రతినిధుల ద్వారా సీఎం కేసీఆర్‌కు, విద్యాశాఖకు నివేదించనున్నట్లు తెలిపారు.  కరీంనగర్‌, ఇతర జిల్లాల బాధ్యులు కలుపుకొని సుమారు 10వేల మందికిపైగా
విద్యావేత్తలు పాల్గోనే వారి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. కరీంనగర్‌ ఎంపీ వినోద్‌కుమార్‌, ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్‌, గంగుల కమలాకర్‌, రసమయి బాలకిషన్‌, మనోహర్‌రెడ్డి, రవిశంకర్‌, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు హజరవుతారని తెలిపారు. ఉదయం 10 గంటలకు ప్రారంభయ్యే సభకు అందరు సకాలంలో హాజరై విజయవంతం చేయాలని కోరారు.