నేడు ఢల్లీికి సీఎం కేసీఆర్‌..


` మావోయిస్టు ప్రభావిత ముఖ్యమంత్రుల సమావేశంలో పాల్గొంటారు
` ఇతర కేంద్ర మంత్రులను కలిసే అవకాశం
హైదరాబాద్‌,సెప్టెంబరు 23(జనంసాక్షి): తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ మరోమారు దిల్లీ వెళ్లనున్నారు. మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల సీఎంలతో కేంద్ర హోంశాఖ ఈ నెల 26న నిర్వహించనున్న సమావేశంలో సీఎం పాల్గొననున్నారు. రేపు శాసనసభ సమావేశం, బీఏసీ భేటీ ముగిశాక బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో సీఎం దిల్లీ బయల్దేరి వెళ్తారు. శనివారం కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌తో కేసీఆర్‌ సమావేశమవుతారు. కృష్ణా, గోదావరి నదీ జలాల అంశాలు, నదీ యాజమాన్య బోర్డుల పరిధిని నిర్ణయిస్తూ జారీ చేసిన గెజిట్‌, నీటి కేటాయింపులపై కేంద్ర మంత్రితో చర్చించనున్నారు. అనంతరం ఆదివారం కేంద్ర హోంశాఖ నిర్వహించే సమావేశంలో పాల్గొంటారు. మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం కానున్న కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా.. ఆయా రాష్ట్రాల్లో పరిస్థితిని సవిూక్షించడంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలపైన చర్చించనున్నారు. హోంశాఖ సమావేశం అనంతరం కేంద్ర ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి పీయూష్‌ గోయెల్‌తో కేసీఆర్‌ భేటీ కానున్నారు. ధాన్యం కొనుగోళ్ల అంశంపై గోయెల్‌తో చర్చించనున్నారు. 26న సాయంత్రం కేసీఆర్‌ తిరిగి హైదరాబాద్‌ చేరుకుంటారు.