నేడు లోక్‌ అదాలత్‌

హైదరాబాద్‌,సెప్టెంబర్‌13(జనంసాక్షి): కోర్టుల్లో నలుగుతున్న పలు కేసులను రాజీ కుదుర్చుకునేందుకు వీలుగా సెప్టెంబర్‌ 14న జాతీయ లోక్‌ అదాలత్‌ను నిర్వహించనున్నట్లు మెట్రోపాలిటన్‌ లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ సెక్రటరీ ఎస్‌.స్వాతిరెడ్డి తెలిపారు. నేషనల్‌ లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని కోర్టుల్లో లోక్‌ అదాలత్‌ను నిర్వహించనున్నామన్నారు. హైదరాబాద్‌ జిల్లాలోని అన్ని బెంచ్‌ల్లో అదాలత్‌ను నిర్వహిస్తామని, ఇరు పక్షాలకు చెందిన కక్షిదారులంతా ఈ అదాలత్‌కు హాజరై రాజీ కుదుర్చుకుని తమ సమస్యలను పరిష్కరించుకోవాలన్నారు.