నేడు సిద్దిపేటలో కెసిఆర్ ఎన్నికల సభ
భారీగా ఏర్పాట్లు చేసిన నేతలు
సిద్ధిపేట,నవంబర్19(జనంసాక్షి): సిద్దిపేట జిల్లా కేంద్రంలోని పత్తి మార్కెట్ యార్డు పక్కన ఉన్న మైదానంలో మంగళవారం జరగనున్న సీఎం కేసీఆర్ బహిరంగ సభకు పకడ్బందీ ఏర్పాట్లు చేసారు. భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్రావు ఆధ్వర్యంలో స్థానిక నాయకులు ఏర్పాట్లును పూర్తి చేశారు. సభా ప్రాంగణం, వేదిక, హెలీప్యాడ్, పార్కింగ్ స్థలాలను మంత్రి పరిశీలించారు. భారీ సంఖ్యలో ప్రజలు, కార్యకర్తలు తరలివస్తారని.. వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. హరీశ్ రావు వెంట పోలీస్ ఉన్నతాధికారులు, స్థానిక నేతలు ఉన్నారు.